శ్రీవారి సేవలో పివి సింధు

శ్రీవారి సేవలో పివి సింధు

శ్రీవారి సేవలో పివి సింధుప్రజాశక్తి- తిరుమల తిరుమల శ్రీవారిని బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ.సింధు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామదర్శన సమయంలో సింధు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం సింధు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో సింధు కుటుంబానికి పండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీ రామనవమి పర్వదినాన శ్రీవారి దర్శన భాగ్యం కలగడం చాలా సంతోషంగా ఉందని, జరగబోయే టోర్నమెంట్లో విజయం సాధించాలని శ్రీవారిని కోరుకున్నట్లు సింధు తెలిపారు.

➡️