బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేయండి : కమిషనర్ నాగ నరసింహారావు

Jan 17,2024 16:44 #Commissioner, #Kakinada

ప్రజాశక్తి-కాకినాడ : రానున్న 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు అధికారులను ఆదేశించారు. బడ్జెట్ ప్రతిపాదనలపై స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం అన్ని విభాగాధిపతులతో సమీక్షించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సవరించిన బడ్జెట్ ప్రతిపాదనలు, 2024-25 బడ్జెట్ అంచనాల పై అధికారులతో చర్చించారు. ఈనెల 20వ తేదీ నాటికల్లా ప్రతిపాదనలను పూర్తిచేసేలా అయా విభాగాధిపతులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ పి సత్యకుమారి, కార్యదర్శి ఎం. ఏసుబాబు, డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాస్, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ చరణ్, ఏసిపి నాగశాస్త్రులు, మేనేజర్ కర్రి సత్యనారాయణ, టిపిఆర్ఓ మానే కృష్ణమోహన్, ఏవో శిరీష్, ఈఈ మాధవి, వివిధ విభాగాల సూపరింటెండెంట్ లు పాల్గొన్నారు.

➡️