ఉద్యమ ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి

Dec 15,2023 17:01 #PDF MLC, #road accident
pdf mlc car accident undi

చెరుకువాడలో రోడ్డు ప్రమాదం
తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి
రాష్ట్ర కేబినేట్, చంద్రబాబు, సిపిఎం సంతాపం
భీమవరం ప్రభుత్వాసుపత్రికి భౌతికాయం తరలింపు
తరలివస్తున్న ప్రముఖులు ప్రముఖులు

ప్రజాశక్తి-భీమవరం : ప్రజా ఉద్యమాల ముద్దుబిడ్డ ఉభయ గోదావరి జిల్లాల పిడిఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ తుది శ్వాస విడిచారు. ఉండి మండలం చెరుకు వాడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. ఏలూరు జిల్లా నుంచి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం బయలుదేరిన ఎమ్మెల్సీ సాబ్జీ ఆకివీడులో నాలుగు రోజుల నుంచి జరుగుతున్న అంగన్వాడీల సమ్మెకు సంఘీభావం తెలిపి భీమవరం వస్తుండగా చెరుకువాడ వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జు నుజ్జు అయింది. వ్యాగన్ ఆర్ కార్లో ఎదుర సీట్లో కూర్చున్న సాబ్జీకి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అక్కడి నుంచి పోలీస్ వాహనంలో భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రజానీకం సందర్శనార్థం సాబ్జీ మృతదేహాన్ని భీమవరం ఆస్పత్రిలో ఉంచారు. శాసనమండలి చైర్మన్ రాజు , జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా ఎస్పీ రవి ప్రకాష్, జిల్లా జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, భీమవరం ఆర్డీవో శ్రీనివాసులు రాజు సాబ్జీకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరం, యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి బి గోపి మూర్తి, సిఐటియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జెఎన్వి గోపాలన్, కే రాజా రామ్మోహన్ రాయ్, యుటిఎఫ్ నేతలు, కార్మిక వర్గం అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, కార్మికులు ఘనంగా నివాళులర్పించారు.

ప్రజాస్వామ్య శక్తులకు బాధాకరమైన అంశం : పిడిఎఫ్ ఎమ్మెల్సీలు
పిడిఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి మృతి పట్ల పిడిఎఫ్ ఎమ్మెల్సీల తరఫున కేఎస్ లక్ష్మణ్ రావు, ఐ వెంకటేశ్వరరావు సంతాప ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఉపాధ్యాయుడుగా ఉద్యమ నాయకుడిగా పనిచేస్తూ సాబ్జి యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక ఉద్యమాలలో భాగస్వామి అయ్యారని తెలిపారు. 2021 మార్చిలో తూర్పుగోదావరి పశ్చిమగోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి శాసనమండలికి జరిగిన ఎన్నికలలో ఘన విజయం సాధించారని పేర్కొన్నారు. సిపిఎస్ రద్దు కోసం జరిగిన అనేక పోరాటాలలో క్రియాశీలక పాత్ర వహించారని తెలిపారు. ఉపాధ్యాయుల ప్రయోజనాల పరిరక్షణలో అగ్రభాగాన ఉండటమే కాక ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ కోసం జరిగిన అన్ని ఉద్యమాలలో పాల్గొన్నారన్నారు. ప్రమాదంలో ఆయన మరణించటం ఉపాధ్యాయ ఉద్యమానికి ప్రత్యేకించి ప్రజాస్వామ్య శక్తులకు బాధాకరమైన అంశమన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

ఉపాధ్యాయ ఉద్యమానికి తీరని లోటు : మాజీ పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ
ఎమ్మెల్సీ షేక్ సాబ్జి మృతికి మాజీ పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ సంతాపం వ్యక్తం చేశారు. సాబ్జి మృతి యుటిఎఫ్ ఉద్యమానికి, ఉపాధ్యాయుల ఉద్యమానికి తీరని లోటని తెలిపారు. వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు.

పిడిఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి మృతికి సమ్మె శిబిరంలో సంతాపం ప్రకటిస్తున్న ఆశాలు..
పిడిఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి మృతికి గుంటూరు జిల్లాలోని సంతాపం ప్రకటిస్తున్న ఆశాలు

pdf mlc car accident condolence
ఎమ్మెల్సీ షేక్ సాబ్జి మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్న గుంటూరు జిల్లాలోని సమ్మె శిబిరంలో అంగన్వాడీ కార్యకర్తలు

యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ సంతాపం

యుటిఎఫ్ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు, PDF టీచర్ MLC ఉపాద్యాయ సమస్యలు పరిష్కారంలో అలుపెరుగని కృషి చేసినటువంటి ఉద్యమ నేత భీమవరం ఉండి ప్రాంతంలో రోడ్డు యాక్సిడెంట్ మరణించడం అత్యంత బాధాకరమని వారి మృతి ఉపాధ్యాయ ఉద్యమానికి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షు,ప్రధాన కార్యదర్శి N.వెంకటేశ్వర్లు, KSS ప్రసాద్ తెలిపారు.
అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకి సంఘీభావం తెలియజేయడం కోసం జిల్లాలో పర్యటన చేస్తున్న సాబ్జీ యొక్క కారు యాక్సిడెంట్ కి గురవడం సంఘటన ప్రదేశంలోనే ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులుగాను, ఏలూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి గాను వివిధ బాధ్యతలను పనిచేసినప్పుడు, చివరి దాకా ఉద్యమాల కోసం ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పనిచేశారని వారి మృతిని జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపారు. ఏమైనా ఈరోజు ప్రభుత్వ విద్యా రంగం పరిరక్షించుకోవాల్సిన సందర్భంలో ఇలా జరగడం బాధాకరం అని తెలిపారు. గత వారంలో ఏలూరులో జరిగినటువంటి 49వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో దగ్గరుండి కౌన్సిలర్ అందరికి సదుపాయాలు చూడటంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు. షేక్ సాబ్జి మృతి యుటిఎఫ్ ఉద్యమానికి, ఉపాధ్యాయుల ఉద్యమానికి తీవ్రలోటని తెలిపారు. వారి కుటుంబానికి తీవ్ర సానుభూతిని తెలియజేశారు.

సిపిఎం సంతాపం
ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మృతి పట్ల సిపిఎం సంతాపం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రకటనను విడుదల చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన మృతి ప్రజా ఉద్యమాలకు, ఉపాధ్యాయ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు.

pdf mlc car accident sabji c
రాష్ట్ర కేబినేట్ సంతాపం

https://x.com/ncbn/status/1735577089678676363?t=3U22i7u7i30Hbu74TNwluA&s=08

అత్యంత విషాదకరం : చంద్రబాబు
పిడిఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత విషాదకరమని టిడిపి అధినేత చంద్రబాబు ఎక్స్ లో పోస్ట్ చేశారు. అంగన్వాడీల పోరాటానికి మద్దతు తెలిపి అనంతరం మృతి చెందడం విచారకమని తెలిపారు. తన చివరి ఘడియల్లో సైతం ప్రజా సేవలోనే గడిపిన షేక్ సాబ్జీ మృతికి తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తీవ్ర దిగ్భ్రాంతి : మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహా రెడ్డి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మరణించడం తీవ్ర దిగ్భ్రాంతిని, ఆవేదనను కలిగించిందని మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూ..శాసన మండలిలోనూ ఉద్యోగ, కార్మికుల పక్షాన గట్టిగా వాణిని వినిపించే ఉద్యమ నేత మరణం ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గానికి విద్యా రంగానికి తీరని లోటని తెలిపారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతికి ఏపిటీఎఫ్ తీవ్ర సంతాపం

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, యుటియఫ్ పూర్వ అధ్యక్షులు, ఉద్యమ సహచరులు షేక్ సాబ్జీ గారి అకాల మృతికి ఏపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, యస్.చిరంజీవి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారు విద్యారంగ, ఉపాధ్యాయ రంగ ప్రయోజనాల కోసమే కాకుండా అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం అనేక పోరాటాలు చేసిన చురుకైన ఉద్యమ కారుడు. వారిలేని లోటు ఉపాధ్యాయ ఉద్యమానికి తీరని లోటని ఏపిటిఎఫ్ తమ సంతాప ప్రకటనలో తెలియజేసినది.

బాధాకరం : తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం
ఉపాధ్యాయ ఉద్యమ నేత పిడిఎఫ్ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ రోడ్ ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం తెలిపింది. వారి మరణం మన ఉపాధ్యాయ లోకానికి తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిజేశారు. సాబ్జికి నివాళులు అర్పిస్తూ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం పక్షాన తీవ్ర సంతాపం ప్రకటించారు.

రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. శాసనమండలిలో వినిపించే ప్రజల గొంతు మూగబోయింది. ఉపాధ్యాయుల హక్కుల పోరాటయోధుడు షేక్ సాబ్జీకి నివాళులర్పిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం ‌తెలియజేస్తున్నాను.
– నారా లోకేష్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి


ఈరోజు ఉదయం 11 గంటలకు కైకలూరులో అంగన్వాడీల సమ్మె శిబిరానికి వెళ్లి సంఘీభావం తెలిపి ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ ప్రసంగించారు.

ఎమ్మెల్సీ షేక్‌

➡️