ఉపాధి పనులను పరిశీలిస్తున్న పిడి

Mar 6,2024 00:06

ప్రజాశక్తి – సంతమాగులూరు
ప్రతి పంచాయితీలో వంద వందమందికి తగ్గకుండా ఉపాధి హామీ పనులు చేపట్టాలని డ్వామా పీడీ బి అర్జునరావు అధికారులను ఆదేశించారు. మండలంలోని వెల్లలచెరువు పంచాయతీలో సేద్యపు నీటి కుంటలో పనిచేస్తున్న ఉపాధి హామీ పనులను మంగళవారం పరిశీలించారు. కూలీలతో మాట్లాడారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం సమావేశం హాలులో క్షేత్రస్థాయి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పనులు మొదలైనందున 2024-25 వార్షిక సంవత్సరానికి సంబంధించి నాలుగు లక్షల పని దినాలకు ఎస్టిమేషన్ తయారు చేసుకుని సెల్పులో ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఒ కాశయ్య, ఏపీఒ ఈసీ సురేష్, టిఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

➡️