ప్రజాశక్తి – గొల్లప్రోలు(పిఠాపురం)
మండలంలోని చేబ్రోలు గ్రామంలో భారత చైతన్య యువజన పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ ఎంఎల్ఎ అభ్యర్థి బిగ్ బాస్ ఫ్రెమ్ తమన్నా సింహాద్రి గురువారం ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ అన్ని కులాలను, మతాలను అందరిని కలుపుకుని ముందుకు సాగుతుందన్నారు. తనను నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారని నమ్మకంతో పొటి చేస్తున్నానని తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు మాత్రమే పోటీలో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.శ్రీను, కళ్యాణి, ఎం.శివ, ఎం.సుబ్బారావు, పి.రాజా పాల్గొన్నారు.