నూటికి నూరు శాతం పన్నులు వసూలు చేయాలి : మున్సిపల్‌ కమిషనర్‌

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): మార్చి నెలాఖరు నాటికి నూటికి నూరు శాతం పన్నులు వసూలు చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ కె.వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం మున్సిపల్‌ కార్యాలయంలో సచివాలయ అడ్మిన్‌ సెక్రటరీలు,ప్లానింగ్‌ సెక్రటరీలు,నోడల్‌ ఆఫీసర్స్‌ తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురపాలక సంఘ పరిధిలో గల ఇంటి పన్నులు, ఖాళీ స్థలము పన్నులు ,మంచి నీటి కుళాయి పన్ను చెల్లింపులకు సంబందించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వారు ఉత్తర్వుల మేరకు 2023-24 వరకు ఉన్న పన్నుబకాయిలను ఏకమొత్తముగా చెల్లించినచో అపరాధ రుసుము లేకుండా (వడ్డీ లేకుండా) చెల్లించుటకు ప్రభుత్వము వారు అవకాశము కల్పించారన్నారు.కావున ఈ సదవకాశమును నరసాపురం పట్టణ ప్రజలు సద్వినియోగ పరచుకొనేలా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.

➡️