-ఒక విద్యార్థికి తీవ్రంగా, పలువురికి స్వల్పంగా గాయాలు
ప్రజాశక్తి- చింతలపూడి :విద్యార్థులతో వెళ్తున్న ఆటో, ద్విచక్ర వాహనం ఢకొీని ఒకరు మృతి చెందారు. ఒక విద్యార్థికి తీవ్రంగానూ, పలువురు విద్యార్థులకు స్వల్పంగానూ గాయాలయ్యాయి. ఈ ఘటన ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… శ్రీ చైతన్య టెక్నో పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థులు పాసింజర్ ఆటోలో వారి ఇళ్లకు వెళ్తున్నారు. పాత చింతలపూడి వాటర్ ట్యాంక్ సమీపాన వారి ఆటో, ఎదురుగా వస్తున్న బైకు ఢకొీన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు బైముతక శ్రీను (40) తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలోని తొమ్మిదో తరగతి విద్యార్థి వై.గోపాలరెడ్డి తీవ్రంగా, పలువురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. చింతలపూడి ప్రభుత్వాస్పత్రికి శ్రీనును తరలించారు. జంగారెడ్డిగూడెం డిఎస్పి రవిచంద్ర ఆ ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, చింతలపూడి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనును వైసిపి చింతలపూడి ఎంఎల్ఎ అభ్యర్థి కంభం విజయరాజు పరామర్శించారు. విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. విద్యార్థి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మెరుగైన చికిత్సం కోసం శ్రీనును గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు.