కోజికోడ్ : అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవ వేడుకకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన ఒక విద్యార్థిపై కేరళలోని కోజికోడ్ – ఎన్ఐటి ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ విద్యాసంస్థలో బిటెక్ నాలుగో ఏడాది విద్యార్థి వైశాఖ్ ప్రేమ్ కుమార్ గత నెల 22న రామమందిరం ప్రారంభోత్సవానికి వ్యతిరేకంగా ప్లకార్డుతో నిరసన తెలిపాడు. ‘ఇండియా అంటే రామరాజ్యం కాదు’ అని ప్లకార్డుపై రాసి ఉంది. ఇలా నిరసన వ్యక్తం చేసినందుకు కొంతమంది విద్యార్థులు ఇప్పటికే ప్రేమ్కుమార్పై దాడికి కూడా పాల్పడ్డారు. ప్రేమ్కుమార్ చర్య క్యాంపస్లో అశాంతికి కారణమయిందని, క్యాంప్ గౌరవాన్ని తగ్గించడానికి ప్రయత్నించాడని ఆరోపిస్తూ, ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ డీన్ ఉత్తర్వులు జారీ చేశారు. హాస్టల్తో సహా క్యాంపస్ ప్రాంగణంలోకి ఏడాది పాటు ప్రవేశించకుండా నిషేధం విధించారు.