లారీ క్రింద పడి ఒకరి మృతి

Mar 16,2024 12:31 #palnadu district
  • డివైడర్ ను ఢీకొన్న సిమెంట్ ట్యాంకర్ లారీ బోల్తా…

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : వేగంగా వెళుతున్న సిమెంట్ ట్యాంకర్ లారీ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా పడిన సంఘటన రొంపిచర్ల మండలం పరిధిలో అద్దంకి-నార్కెట్ పల్లి జాతీయ రహదారి మార్గంలో విప్పర్ల గ్రామంలో శనివారం జరిగింది. ఈ ప్రమాదంలో లారీ క్రింద పడి ఒక వ్యక్తి మృతి చెందారు. ఒంగోలు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న టిఎస్ 29టిబి 6879 నెం. గల సిమెంట్ ట్యాంకర్ వేగం అదుపు తప్పి వెళుతున్న లారీ మండలంలో విప్పర్ల గ్రామం వద్ద రోడ్డు దాటుతుండగా అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది. ఈ సంఘటనలో రోడ్డు దాటుతున్న రొంపిచర్ల మండలం గోగులపాడు గ్రామానికి చెందిన ఫాస్టర్ ఉయ్యాల అద్దయ్య (40) పాస్టర్ పై లారీ పడి అక్కడికక్కడే మృతి చెందారు. విప్పర్ల గ్రామంలో చర్చి నిర్మాణం నిమిత్తం స్ధలం కొనుగోలు చేసి అక్కడే కుటుంబంతో సహా నివాసముంటున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారు అయ్యారు. అనంతరం క్రేన్ సహాయంతో సిమెంట్ ట్యాంకర్ లారీ పైకి లేపి దాని క్రింద ఉన్న అద్దయ్య మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తము నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ కె.పి.రవీంద్ర తెలిపారు.

➡️