Lok Sabha Polls:వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపు

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రం 19 కేజీల వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గించింది. ఒక్కో సిలిండర్‌పై రూ.30.50 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త ధరలు సోమవారం నుంచే అమలులోకి రానున్నట్లు తెలిపింది. దీంతో ఢిల్లీలో 19 కేజీల సిలిండర్‌ ధర రూ.1,764.50కు చేరింది. ఐదు కేజీల ఫ్రీ ట్రేడ్‌ ఎల్‌పిజి (ఎఫ్‌టిఎల్‌) ధరను రూ.7.50 తగ్గిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది మార్చి 1న వాణిజ్య వంటగ్యాస్‌ ధరను రూ.25 ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచిన సంగతి తెలిసిందే.

➡️