Odisha : ఒడిశాలో అధికార బీజేడీకి షాక్‌.. సిట్టింగ్‌ ఎంపీ రాజీనామా

Mar 30,2024 16:50 #Anubhav Mohanty, #Odisha

భువనేశ్వర్‌ : లోక్‌సభ ఎన్నికలకు ముందు ఒడిశాలోని బిజెడి (బిజు జనతాదళ్‌) పలువురు కీలక నేతలు షాక్‌ ఇస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు ప్రియదర్శి మిశ్రా, ఆకాశ్‌ దాస్‌ నాయక్‌లు ఆ పార్టీని వీడారు. ఇప్పుడు తాజాగా సిట్టింగ్‌ ఎంపి అనుభవ్‌ మొహంతి కూడా ఆ పార్టీని వీడారు. ఆయన శనివారం బిజెడి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆ పార్టీ అధ్యక్షుడు, సిఎం నవీన్‌ పట్నాయక్‌కి పంపించారు. ఈ సందర్భంగా తనకు ప్రజాసేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు నవీన్‌ పట్నాయక్‌కు, బిజెడికి మొహంతి కృతజ్ఞతలు తెలిపారు. కేవలం తన వ్యక్తిగత కారణాల రీత్యానే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

కాగా, అనుభవ్‌ మొహంతి గత కొన్నిరోజులుగా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు. ఆ పార్టీకి స్టార్‌ క్యాంపెయినర్‌గా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం మొహంతి కేంద్రపార నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

➡️