పౌష్టికాహారంపై అవగాహన ర్యాలీ

Mar 22,2024 16:47 #Krishna district

ప్రజాశక్తి-చల్లపల్లి : పోషణ్ అభియాన్ పోషణ సంబరాలు సందర్భంగా ఐసిడిఎస్ పిలుపుమేరకు అంగన్వాడీ కార్యకర్తలు పలు కార్యక్రమాలు నిర్వహించారు. పౌష్టిక ఆహారంపై అవగాహన కల్పిస్తూ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. చల్లపల్లి మండల పరిధిలోని చల్లపల్లి 12వ అంగన్వాడీ కేంద్రం, నడకుదురు 2, నిమ్మగడ్డ, వెలివోలు యార్లగడ్డ అంగన్వాడీ కేంద్రాలలో శుక్రవారం పోషణ పక్వాడ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు, పిల్లలకు, తల్లులకు బాలింతలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పౌష్టిక ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంగన్వాడీ కార్యకర్తలు సూచించారు. పౌష్టికాహారము యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. కిషోర్ బాలికలకు ఆటల పోటీలు, సైకిల్ పోటీలునిర్వహించారు. ఈ కార్యక్రమాలలో అంగన్వాడి కార్యకర్తలు, సహాయకులు పాల్గొన్నారు.

➡️