నున్నలో కళ్లం వెంకటేశ్వరరావు ప్రచారం

Apr 18,2024 18:02 #cpm

ప్రజాశక్తి-గన్నవరం
ఇండియా కూటమి బలపర్చిన సిపిఎం గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు గురువారంనాడు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆయనకు మద్దతుగా సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు ప్రచారంలో పెద్దఎత్తున పాల్గంటున్నారు. విజయవాడ రూరల్‌ మండలం నున్నలో జరిగిన ప్రచార కార్యక్రమంలో అభ్యర్థి కళ్ళం వెంకటేశ్వరరావుతోపాటుగా సిపిఎం నాయకులు ముజఫర్‌ అహ్మద్‌, శ్రీరాములు, కెఆర్‌కె మూర్తి, బిఎన్‌కె నారాయణ, జి.వి.రంగారెడ్డి తదితరులు పాల్గన్నారు. గ్రామంలో ప్రతి ఇంటికీ వెళ్లి సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుపై తమ అమూల్యమైన ఓట్లు వేసి కళ్లం వెంకటేశ్వరరావును గెలిపించాలని నాయకులు కోరారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ మతోన్మాద విధానాలను వ్యతిరేకిస్తూ రూపొందించిన కరపత్రాలను పంచారు.

➡️