రాయలసీమ వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌లకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

Dec 5,2023 14:28 #AP High Court
high court

ప్రజాశక్తి-అమరావతి: రాయలసీమ వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌లకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఎంఈడీ కళాశాలలకు గుర్తింపు ఇవ్వలేదని గతంలో కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన ధర్మాసం కళాశాలలకు గుర్తింపు ఇవ్వాలని ఆదేశించింది. అయితే న్యాయస్థానం ఆదేశాలను వీసీ, రిజిస్ట్రార్‌ పట్టించుకోలేదు. దీంతో కళాశాలల యాజమాన్యాలు మరోసారి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో ఇవాళ హైకోర్టు ముందుకు వీసీ, రిజిస్ట్రార్‌లు హాజరుకావాల్సి ఉన్నా.. రానందున ఇరువురికీ నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ను హైకోర్టు జారీ చేసింది.

➡️