ప్రజాశక్తి-మంగళగిరి : మంగళగిరిలోని కార్పొరేషన్ కార్యాలయంలో యువనేత నారా లోకేష్ తరపున కూటమి నేతలు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి రాజకుమారి గనియాకు రెండు సెట్ల నామినేషన్ పత్రాలు అందించారు. టీడీపీ సమన్వయ కర్త నందం అబద్దయ్య, జనసేన సమన్వయ కర్త చిల్లపల్లి శ్రీనివాసరావు, బీజేపీ సమన్వయకర్త పంచుమర్తి ప్రసాద్ నేతృత్వంలో నామినేషన్ దాఖలు చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు దాఖలు చేశారు. పాత మంగళగిరి సీతారామ కోవెల నుండి భారీ ప్రదర్శనతో పట్టణంలో ప్రదర్శన నిర్వహించి, కొత్త బస్టాండ్ సెంటర్ వద్ద గల ఎంటిఎంసి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో పోతినేని శ్రీనివాసరావు, దామర్ల రాజు, తోట పార్థసారధి, ఆరుద్ర భూలక్ష్మీ, ఆకుల జయసత్య, బొంతు సాంబిరెడ్డి, ఇబ్రహీం, విజరు కుమార్, చాగంటి పూర్ణ, జ్యోతిబసు, సంకా బాలాజీ గుప్తా, మైనర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.