న్యూఢిల్లీ : బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన జెడియు జాతీయ కార్యవర్గ సమావేశంలో సీనియర్ నేత లలన్ సింగ్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రకటన వెలువడిన కొన్ని నిమిషాలకే ఆయన రాజీనామాను ఆమోదించడంతో పాటు పార్టీ అధ్యక్షుడిగా నితీష్కుమార్ నియమితులవడం గమనార్హం. కాగా, ఇటీవల పార్టీ అధ్యక్ష బాధ్యతలు నితీష్కుమార్ చేపట్టనున్నారన్న ఊహాగానాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.