ఒప్పో నుంచి కొత్త ఎ59 5జి

Dec 22,2023 21:15 #Business

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తుల కంపెనీ ఒప్పో తన ఎ సీరిస్‌లో కొత్తగా ఎ59 5జిని విడుదల చేసింది. 4జిబి, 128జిబి వేరియంట్‌ ధరను రూ.14,999గా నిర్ణయించింది. 5,000 ఎంఎహెచ్‌ బ్యాటరీ, డ్యూయల్‌ కెమెరాతో దీన్ని ఆవిష్కరించింది. వెనకవైపు 13 ఎంపి ప్రధాన కెమెరా, 2 ఎంపి కెమెరా, సెల్ఫీ కోసం 8 ఎంపి కెమెరాను అమర్చింది. డిసెంబరు 25 నుంచి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో లభ్యమవుతుందని తెలిపింది. ఎంపిక చేసిన బ్యాంక్‌ కార్డులపై రూ.1,500 వరకు తగ్గింపును అందిస్తున్నట్లు పేర్కొంది.

➡️