బే ఓవల్లోని మౌంట్ మౌంగనుయి స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ విజయాన్ని అందుకుంది. 281 పరుగుల తేడాతో కివీస్ రికార్డు విజయం సాధించింది. 528 పరుగుల భారీ ఛేదనలో ప్రొటీస్ 247 పరుగులకు ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్లో డేవిడ్ బెడింగన్ (87) ఒక్కడే హాఫ్ సెంచరీతో పోరాడాడు. రేనార్డ్ వాన్ టోండర్ (31), జుబేర్ హంజా (36), రువాన్ డి స్వర్డ్ (34) పరుగులు చేశారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 511 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర 366 బంతుల్లో 26 ఫోర్లు, 3 సిక్సులతో 240 రన్స్ చేశాడు. స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (118) సెంచరీ బాదాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 162 పరుగులకు ఆలౌటైంది. కీగన్ పీటర్సన్ చేసిన 45 పరుగులే టాప్ స్కోర్. మాట్ హెన్రి, సాంట్నర్ తలో మూడు వికెట్స్ పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్లో విలియమ్సన్ (109) మరో సెంచరీ చేయగా.. 179 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం బౌలింగ్లో కైల్ జేమీసన్ నాలుగు వికెట్స్ , మిచెల్ సాంట్నర్ చెలరేగడంతో చేసిన కివీస్ భారీ విజయాన్ని అందుకుంది. రచిన్ రవీంద్ర(కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ విజయంతో కివీస్ రెండు టెస్టుల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.