- యువతకు గవర్నరు పిలుపు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వినూత్న ఆలోచనలతో దేశ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లాలని యువతకు రాష్ట్ర గవర్నరు అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. రాజ్భవన్లో సోమవారం జరిగిన వికసిత్ భారత్ 2047-వాయిస్ ఆఫ్ యూత్ వర్క్షాపునకు గవర్నరు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వికసిత్ భారత్ను ఆదర్శంగా తీసుకుకోవాలని, 2047 నాటికి అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు. అంతకముందు ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ వర్క్షాపులో ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జె శ్యామలరావు, హయ్యర్ ఎడ్యుకేషన్ స్టేట్ కౌన్సిల్ ఛైర్మన్ ప్రొఫెసరు కె హేమచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.