ప్రజాశక్తి-మంగళగిరి రూరల్ (గుంటూరు) : ఆత్మకూరులో నారా బ్రాహ్మణి పర్యటించారు. ఆత్మకూరులోని చేనేత డైయింగ్ షేడ్ని పరిశీలించి.. కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా చేనేత డైయింగ్ కార్మికులుగా పనిచేస్తున్నా మాకు గుర్తింపు లేదని.. మా కష్టం ఎక్కువ వచ్చే ఆదాయం తక్కువని తెలిపారు. నూలుకి రంగులు అద్దె ప్రక్రియ ఎంతో కష్టంతో కూడుకున్నదని అయినా మాకు ప్రభుత్వం నుండి ఎటువంటి గుర్తింపు.. సహాయం అందడం లేదన్నారు. డైయింగ్ ప్రక్రియలో వాడే కెమికల్స్ వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్న మాకు తెలిసిన పని ఇది ఒక్కటే కాబట్టి దీనినే నమ్ముకొని పనిచేస్తున్నామన్నారు. వర్షా కాలం పని ఎక్కువ ఆదాయం తక్కువ ఉంటుందని వివరించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ.. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కార్మికులను ఆదుకుంటామని తెలిపారు.