23న నాటక రంగ నంది అవార్డులు అందజేత : పోసాని

Dec 11,2023 14:21 #Posani Krishna Murali

ప్రజాశక్తి-అమరావతి: ఈ నెల 23న నాటక రంగ నంది అవార్డులు అందిస్తున్నామని ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్‌ పోసాని కృష్ణమురళీ వెల్లడించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పూర్తి పారదర్శకంగా అవార్డుల ఎంపిక చేపడుతున్నట్లు తెలిపారు. ప్రముఖ నాటకరంగ వ్యక్తులతో కమిటీ ఏర్పాటు చేశామని.. నంది అవార్డుల కోసం 115 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. అందులో 38 మందిని ఎంపిక చేశామన్నారు. 5 కేటగిరీలలో మొత్తం 74 అవార్డులు ఇస్తామని.. ఎమ్మెల్యే, ఎంపీల సిఫార్సులకు తావులేదన్నారు.

➡️