ప్రజాశక్తి – గుడ్లవల్లేరు : వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఫౌండర్, మెంబర్, హై5 యూత్ ఫౌండేషన్ అధ్యక్షురాలు కొల్లిపర అనసూయ సోమవారం రాత్రి ఢిల్లీ రాజ్ భవన్లో నంది అవార్డు అందుకున్నట్లు హై5 ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ గోట్రు నాగబాబు తెలిపారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ తన భర్త కొల్లిపర ప్రార్ధసారథి నాగేశ్వరరావు ప్రోత్సాహంతో గత 25 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రాష్ట్ర స్థాయిలో నంది అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. తనకు ఈ అవార్డు రావడంతో మరింత బాధ్యతలు పెంచాయని అన్నారు. ఈ సందర్భంగా హై 5 యూత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ గోట్రు నాగబాబు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ప్రభుత్వం చే గుర్తింపు పొందిన హై 5 యూత్ ఫౌండేషన్ 17 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు, విద్య వైద్యం శుభ్రతల గురించి అవగాహన కార్యక్రమాలు చేస్తూ ప్రతి రోజూ ఒకరికైనా భోజనం పెట్టాలి అనే నినాదంతో తలపెట్టి ప్రతి రోజూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ నేపథ్యంలో తమ సంస్థ నుంచి ఇంటర్నేషనల్ సంస్థ అయిన శిఖరం ఆర్ట్స్ ధియేటర్ వారు ఢిల్లీ ఏపీ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుంచి తమ సంస్థ అధ్యక్షురాలు కొల్లిపర అనసూయ అందుకోవడం సంస్థ వ్యవస్థాపకుడిగా సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డులు సంస్థకు గౌరవ మర్యాదలు తిసుకువస్తూనే మరింత బాధ్యతలు పెంచాయన్నారు.