ఇరు రాష్ట్రాల పోలీస్ వలయంలో సాగర్ ప్రాజెక్ట్

Dec 1,2023 11:55 #AP vs TS, #Dispute, #Nagarjuna Sagar
nagarjuna sagar dispute

ప్రజాశక్తి-మాచర్ల : నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పై ఏపి-తెలంగాణ పోలీసులు భారీగా మోహరించారు. సాగర్ డ్యాం వద్దకు 1600 ఏపి పోలీసులు చేరుకున్నారు. మరోవైపు సాగర్ ప్రాజెక్ట్ కు తెలంగాణ పోలీస్ బలగాలు భారీగా చేరుకున్నారు. నేడు సాగర్ ప్రాజెక్ట్ వద్ద పరిస్థితిని తెలంగాణ నీటి పారుదుల శాఖ సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్ ర్వాల్ సమీక్షించనున్నారు. అక్కడ పరిస్థితిపై సిఎంకి నివేదిక ఇవ్వనున్నారు. గత రెండు రోజులుగా పల్నాడు జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి సాగర్ లోనే మకాం వేశారు. గురువారం సాగర్ కుడికాలువకు బలవంతంగా తాగునీటిని విడుదల చేసి ఏపి జనవరుల శాఖ పంతం నెగ్గించుకుంది. సాగర్ పై ఆధిపత్యం కోసం ఏపి – తెలంగాణ రాష్ట్రాలు కాలుదువ్వుకుంటున్నారు.

➡️