ప్రజాశక్తి-ఆచంట( పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి వేడుకలుఘనంగా నిర్వహించారు. ఆచంట మండలంలో ఆచంట, పడమంచిలి, పెదమల్లం, వల్లూరు, భీమలాపురం, శేషమ్మ చెరువు, అయోధ్య లంక, గ్రామాల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కేతా మీరయ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నందమూరి తారక రామారావు ఆశయ సాధన కోసం యువత ముందుకు సాగవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా పేదలకు పళ్ళు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఉప్పలపాటి సురేష్ బాబు, ఎంపీపీ దిగమర్తి సూర్యకుమారి, వైస్ ఎంపీపీ తాళం శ్రీనివాసరావు, నాయకులు బీరా నరసింహా మూర్తి , తమ్మినేడి ప్రసాద్, బోడపాటి దుర్గాప్రసాద్, కేతా మురళి, చిలుకూరి వీర వెంకట సత్యనారాయణ, ఏడిద శ్రీనివాస్, రమేష్, సత్యనారాయణ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.