పంత్‌కు క్లియరెన్స్‌ సర్టిఫికేట్‌ ఇచ్చిన ఎన్‌సీఏ

Mar 11,2024 16:43 #Cricket, #IPL, #rishab pant, #Sports

టీమ్‌ ఇండియా స్టార్‌ క్రికెటర్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌కు ఎన్‌సీఏ క్లియరెన్స్‌ సర్టిఫికేట్‌ ఇచ్చింది. దీంతో పంత్‌ తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు మార్గం సుగమమైంది. 2022 డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్‌ ఆటకు దూరమై దాదాపు 15 నెలలు అవుతుంది. గాయాల నుంచి కోలుకున్న పంత్‌ ఫిట్‌నెస్‌ సాధించేందుకు ఎన్‌సీఏలో కష్టపడ్డాడు. తాజాగా ఎన్‌సీఏ క్లియరెన్స్‌ ఇవ్వడంతో అతను తిరిగి మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు. త్వరలోనే పంత్‌ ఢిల్లీ క్యాంప్‌లో చేరనున్నాడు. ఈ సీజన్‌లో ఢిల్లీని పంతే నడిపిస్తాడని టీమ్‌ వర్గాలు ఇప్పటికే ధ్రువీకరించిన విషయం తెలిసిందే.

➡️