నిజామాబాద్ : మహవీర్ జయంతి సందర్భంగా ఆదివారం మాంసం దుకాణాలు మూసి ఉంచాలని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మంద మకరందు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో ఎక్కడ కూడా చికెన్, మటన్ దుకాణాలు తెరిచి ఉంచవద్దన్నారు. స్లాటర్హౌజ్ కూడా మూసి వేయనున్నట్లు తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి దుకాణాలు తెరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా నగరంలో ఉదయం తనిఖీలు చేయాలని ఎంహెచ్వోకు ఆదే శాలు జారీ చేశారు.