ముస్లింలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి

Jan 7,2024 23:49

ప్రజాశక్తి – బాపట్ల
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బాపట్ల అసెంబ్లీ సీటు ముస్లింలకు కేటాయించాలని నియోజకవర్గ ముస్లిం వెల్ఫేర్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ రషీద్ కోరారు. పట్టణంలో ఇస్లాంపేటలో ముస్లిం సోదరులతో కలిసి ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ముస్లింలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీకే ముస్లింల మద్దతు ఉంటుందని తెలిపారు. మైనార్టీల శ్రేయస్సు కోరే పార్టీలకు తమ రాజకీయ సహాయ, సహకారాలు అందిస్తామని అన్నారు. నియోజకవర్గంలోని బాపట్ల, పిట్టలవానిపాలెం, కర్లపాలెం మండలాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు ఓటములు తేల్చగలిగే ముస్లింలకు ఏదో ఒక రాజకీయ పార్టీ అసెంబ్లీ టికెట్ ముస్లింలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పఠాన్ రాజేష్, భాష, షేక్ జిలాని, ముస్లిం నాయకులు, యువకులు పాల్గొన్నారు.

➡️