గుడ్ ఫ్రైడే ర్యాలీలో ముస్లింల సోదరభావం

Mar 29,2024 13:12 #Communal Harmony, #Eluru district

ప్రజాశక్తి-చింతలపూడి : పవిత్ర గుడ్ ఫ్రై డే సందర్భంగా ఏలూరు జిల్లా చింతలపూడి ఆర్ సిఎం చర్చ్ ఫాదర్ కామ మ్యాత్యూ ఆధ్వర్యంలో వందలమంది క్రైస్తవ విశ్వాసకులు ర్యాలీగా మండుటెoడలో ప్రార్దనలు జరుపుతూ పట్టణంలో ర్యాలీగా కదిలారు. ఫాదర్ మ్యాత్యూ తదితరులు శిలువను మోస్తూ యేసు చేసిన త్యాగాలను వివరించారు. అయితే మండుటెoడలో శిలువతో వెళ్తున్న క్రైస్తవ విశ్వాసకులకు చింతలపూడి పట్టణ ముస్లింలు బాసటగా నిలిచారు.  తమ వంతుగా శీతల పానీయంలను సుమారు పదిహేను వందల మంది క్రైస్తవ విశ్వాసలకు అందించి తమ సోదరభావం చాటారు. భారతదేశం సర్వమత సమ్మేళనం అని, ఏ మతమైనా బోధించేది మంచి చేయాలి అన్నదే అని, మానవుల అంతా ఒక్కటే అని చింతలపూడి మసీదు కమిటీ ప్రెసిడెంట్ సయ్యద్ రహీమ్, జమ తే ఇస్లామి హింద్ అధ్యక్షుడు ఎస్ కే హుస్సేన్ లు అన్నారు. ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రై డే రోజు తమ వంతు సోదరభావంతో క్రైస్తవ సోదరులకు బాసటగా నిలుస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు ఎండీ అక్బర్ అలి, ఎండీ జిలానీ, సయ్యద్ ఖాజా, అజాద్, హాజీ, రజాక్ , నవాబ్, ఇమ్రాన్, బక్షూ, రఫీ, బషు, ముజహిద్ అబిద్, అస్లం, రఫిక్, తదితరులు పాల్గొన్నారు.

➡️