హత్య చేసిన నిందితులు అరెస్ట్ 

Jan 15,2024 15:34 #Chittoor District, #Crimes in AP
Murder accused arrested

డిఎస్పి సుధాకర్ రెడ్డి

ప్రజాశక్తి-బంగారుపాళ్యం : చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో యువకుడిని హత్య చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు డిఎస్పి సుధాకర్ రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగలాపురం గ్రామానికి చెందిన బాబు కుమారుడు ఉమాపతి శుక్రవారం రాత్రి నాగలాపురం అడివి ప్రాంతంలో తుపాకీతో కాల్చి చంపిన ఘటనలో నిందితులు నాగరాజ్, వెంకటేశులు, పాండ్యా, శేఖర్ లను అదుపులో తీసుకొని విచారించగా నాగరాజు అనే నిందితుడు తుపాకితో కాల్చాడని అక్కడినుండి గ్రామ సమీపంలోని బండ వద్దకు నలుగురు నిందితులు ఉమాపతిని తీసాక రావడంతో అక్కడ మృతి చెందాడని నేరం అంగీకరించారు. దీంతో పై నిందితులపై అక్రమ ఆయుధాలు కలిగి ఉండడం వన్యప్రాణుల వేట ఆడడం కేసు నమోద చేసి కోర్టుకు తరలించినట్టు డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ నాగరాజ్ రావు ఏఎస్ఐ మల్లప్ప పలువురు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️