ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 7) ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగే ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ తొలుత టాస్ ఓడి బ్యాంటింగ్ కు దిగింది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషాన్, హార్డిక్ పాండ్యా, టీమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్ రాణించడంతో నిర్ణిత 20 ఓవర్లల్లో 235 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 49 పరుగుల (27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్ 42 (23 బంతుల్లో ; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), పాండ్యా 39 (33 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్లు), టీమ్ డేవిడ్ 45 (21 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ 39 (10 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) కోట్టడంతో 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నార్ట్జే నాలుగు ఓవర్లలో 65 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, ఖలీల్ అహ్మద్ 39 పరుగులు ఇచ్చి 1 వికెట్ ,అక్షర్ పటేల్ 35 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఇషాంత్ శర్మ 40, రిచర్డ్సన్ 40, లలిత్ యాదవ్ 15 పరుగులు ఇచ్చారు.