ప్రజాశక్తి-అమరావతి : అమరావతి పరిరక్షణకు రాజధాని రైతులు చేపట్టిన ఉద్యమం గురువారంతో 1,500 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా లోకేష్ ఎక్స్ (ట్విటర్)గా స్పందించారు. ”కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులకు ఎదురొడ్డి నిలబడింది అమరావతి. ప్రజా రాజధాని కోసం 1500 రోజులుగా నియంతపై పోరాడుతున్న రైతులకు ఉద్యమాభివందనాలు. అమరావతి కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు. వారి ఆశయం త్వరలోనే నేరవేరుతుంది. రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం భూమిని త్యాగం చేసిన రైతులకు న్యాయం జరుగుతుంది. అధర్మం పై ధర్మం విజయం సాధిస్తుంది.” అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.