మసీదులు ముస్తాబు

Apr 9,2024 18:00

ప్రజాశక్తి – వీరులపాడు : మండలంలో పలు గ్రామాల్లో ఉన్న మసీదులు ఈద్గా రంగులతో రంగులతో ముస్తాబవుతున్నాయి. ఈ మాసం పూర్తిగా ఖురాన్‌ను పూర్తిగా కంఠస్తం చేసి ఖురాన్‌ గ్రంథం అధ్యయనం చేస్తారు. ఐదు పూటలు క్రమం తప్పకుండా నమాజ్‌ ఆచరిస్తారు. అన్ని గ్రామాల్లో మతసామరస్యంగా అందరు కలిసి మెలిసి ఇఫ్తార్‌ విందులు ఏర్పాటు చేసుకోవడం ఒకరినొకరు స్నేహంగా ఉండాలని కోరుకుంటారు. జుజ్జూరు గ్రామంలో గౌసియా జామియా ఈద్గా గ్రౌండ్‌లో పలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున ఈద్‌-ఉల్‌-ఫితుల్‌ ప్రత్యేక నమాజ్‌ చదవటానికి చేరుకుంటారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వీరులపాడు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయటం జరుగుతుంది. మండల కేంద్రంలో కోటి రూపాయలతో దాతల సహకారంతో మసీదు పునర్నిర్మాణం చేపట్టినట్లు మసీదు కమిటీ అధ్యక్షులు చిన్న మీరా హుస్సేన్‌ తెలిపారు. ఈద్‌-ఉల్‌-ఫితుర్‌ నవాజ్‌ చంద్రుడు దర్శనం కనిపించగానే ఈదుల్‌ పండుగ నిర్వహించుకోవడానికి సన్నాహాలు చేస్తారు.

➡️