ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ‘సలార్’ చిత్రం ఘన విజయం సాధించింది. బాక్సాఫీస్ను ఈ సినిమా షేక్ చేస్తోంది. తాజాగా హాలీవుడ్కు చెందిన ఓ మీడియాతో ప్రభాస్ మాట్లాడుతూ.. సలార్ మూవీ కథ తనకు ఎంతో నచ్చిందని..సలార్ పార్ట్ 2 మరింత అద్భుతంగా ఉంటుందని తెలిపారు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులతో పని చేయడం ఒక అద్భుతమైన అనుభూతి అని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచమంతా భారతీయ చిత్రాల గురించే చర్చించుకుంటోందని.. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండిస్టీగా గుర్తిస్తున్నారని అన్నారు.