పోలీసులు, జర్నలిస్టులపై గ్రామస్తులు దాడి .. బీహార్‌లో ఘటన

Feb 19,2024 08:01 #Bihar, #journalists, #Mob attack, #police

పాట్నా :    పోలీసులు, జర్నలిస్టులపై   గ్రామస్తులు  దాడికి దిగారు.  ఈ దాడిలో ఇద్దరు జర్నలిస్టులకు తీవ్రగాయాలైనట్లు అధికారులు తెలిపారు. బీహార్‌లోని నవ్‌గాచియా గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది.

వివరాల ప్ర కారం.. శోభాదేవి అనే మహిల ఫిబ్రవరి 16న పాలు అమ్మేందుకు వెళ్లిన శోభాదేవి అనే మహిళ అదృశ్యమైంది.  ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ మహిళ మృతదేహాన్ని ఆదివారం గుర్తించారు.  దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ పోలీసులపై దాడి చేశారు.  పోలీస్‌ వాహనానికి నిప్పుపెట్టారు.  వార్తను కవర్‌ చేసేందుకు వచ్చిన జర్నలిస్టులపై కూడా దాడి చేశారు.  ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

ఈ విషయం తెలుసుకున్న పోలీస్‌ ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, గ్రామస్తులో మాట్లాడారు. మహిళ మృతిపై దర్యాప్తు చేపట్టామని అన్నారు. అలాగే ఆ గ్రామంలో పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులను మోహరించారు.

➡️