పాట్నా : పోలీసులు, జర్నలిస్టులపై గ్రామస్తులు దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరు జర్నలిస్టులకు తీవ్రగాయాలైనట్లు అధికారులు తెలిపారు. బీహార్లోని నవ్గాచియా గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది.
వివరాల ప్ర కారం.. శోభాదేవి అనే మహిల ఫిబ్రవరి 16న పాలు అమ్మేందుకు వెళ్లిన శోభాదేవి అనే మహిళ అదృశ్యమైంది. ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ మహిళ మృతదేహాన్ని ఆదివారం గుర్తించారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ పోలీసులపై దాడి చేశారు. పోలీస్ వాహనానికి నిప్పుపెట్టారు. వార్తను కవర్ చేసేందుకు వచ్చిన జర్నలిస్టులపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
ఈ విషయం తెలుసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, గ్రామస్తులో మాట్లాడారు. మహిళ మృతిపై దర్యాప్తు చేపట్టామని అన్నారు. అలాగే ఆ గ్రామంలో పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులను మోహరించారు.