కొల్లు రవీంద్రను కలిసిన మైనార్టీ బీసీ సంఘం నాయకులు

Jan 23,2024 16:19 #Konaseema, #TDP

ప్రజాశక్తి-రామచంద్రపురం(కోనసీమ) : టిడపి పార్టీ రాష్ట్ర పాలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్రను ఆయన స్వగృహంలో రామచంద్రపురం నియోజకవర్గం మైనార్టీ బీసీ సంఘం అధ్యక్షుడు యాట్ల నాగేశ్వరరావు మర్యాద పూర్వకంగా కలిశారు. రామచంద్రపురం నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే టికెట్‌ మైనార్టీ బీసీలకే ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. వారి ఓటు బ్యావకు దాదాపు 49,000 వేలు ఉందని.. తమ సంఘానికి అన్ని సామాజిక వర్గాలు మద్దతు ఉంటుందని రవీంద్రకు వివరించినట్లు తెలిపారు. విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళతానని రవీంద్ర హామీ ఇచ్చినట్లు నాగేశ్వరరావు వివరించారు.

➡️