ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : నన్నూరులో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పరిమళ అధ్యక్షతన మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సంస్థ అధ్యక్షులు షేక్ అబ్దుల్లా మరియు విజన్స్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు ల ఆర్థిక సహకారంతో శనివారం పాఠశాలకు మైక్ వితరణ చేశారు. ఈ సందర్భంగా పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో విలువలతో కూడిన విద్యను బోధించాలని తెలిపారు. చిన్నతనంలోనే తరగతి గదిలోని నాలుగు గోడల మధ్య విద్యార్థి భవిష్యత్తు నిర్ణయించబడి ఉంటుందని, ఉపాధ్యాయులు వారి భవిష్యత్తుకు పూల బాటలు వేయాలని తెలిపారు. మానవత స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ మరియు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వేణుగోపాల్ నాయుడు, ఉపాధ్యాయినీ-ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.