కూటమి విజయంతోనే వలసలు నివారణ

Apr 25,2024 20:36

ప్రజాశక్తి – నెల్లిమర్ల : సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తే వలసలు నివారణకు కృషి చేస్తామని తనకు గాజుగ్లాసు గుర్తిపై ఓటు వేసి గెలిపించాలని టిడిపి, జనసేన, బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి లోకం మాధవి, టిడిపి రాష్ట్ర పరిశీలకులు సువ్వాడ రవి శేఖర్‌ అన్నారు. ఎన్నికల శంఖారావంలో భాగంగా గురువారం మండలంలోని బొప్పడాం, పినతరిమి, బుచ్చన్న పేట, మధుపాడ, జోగిరాజు పేట గ్రామాలలో ఆమె టిడిపి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఉపాధి హామీ కూలీల దగ్గరరికి వెళ్లి ఈ ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా లోకం నాగమధవి, ఎంపి అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడులను గెలిపించాలని కోరారు. టిడిపి మండల అధ్యక్షులు కడగల ఆనంద్‌కుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డెంకాడ మాజీ జెడ్‌పిటిసి పతివాడ అప్పలనారాయణ, పార్లమెంట్‌ అధికార ప్రతినిధి గేదెల రాజారావు, పార్లమెంట్‌ రైతు ఉపాధ్యక్షులు బొంతు వెంకటరమణ, రాష్ట్ర ఎస్‌సి సెల్‌ అధికార ప్రతినిధి పోతుల రాజప్పన్న, మండల తెలుగు యువత అధ్యక్షులు నల్లం శ్రీను, రామతీర్థం మాజీ సర్పంచ్‌ తాడ్డి సత్యనారాయణ, జనసేన మండల కోఆర్డినేటర్‌ కరుమజ్జి గోవింద్‌, టిడిపి అధికార ప్రతినిధి దనాన్న రామూర్తి, అంబల్ల అప్పలనాయుడు, గదల అచ్చంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️