Medicines – ఏప్రిల్‌ 1 నుండి అత్యవసర మందుల ధరలు పెరుగుదల..!

NPPA : ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగి కోలుకోలేకపోతోన్న సామాన్యులకు … భారీ షాక్‌ తగలనుంది. ఏప్రిల్‌ 1 నుంచి పెయిన్‌ కిల్లర్లు, యాంటీబయోటిక్స్‌, యాంటీ ఇన్‌ఫెక్టివ్‌ వంటి అత్యవసరమైన మందుల ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు నేషనల్‌ లిస్ట్‌ ఆఫ్‌ ఎసెన్షియల్‌ మెడిసిన్స్‌ కింద ఉన్న మందుల ధరలను 0.0055 శాతం పెంచుతున్నట్లు ఎన్‌పిపిఎ వెల్లడించింది. హౌల్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ ఆధారంగా ఈ రేట్లను పెంచుతున్నట్టు ఎన్‌పిపిఎ తెలిపింది. ఇప్పటికే అత్యవసర మందుల ధరలు గత ఏడాది 10 శాతం పెరిగిన సంగతి విదితమే. 2022, 2023లో నేషనల్‌ లిస్ట్‌ ఆఫ్‌ ఎసెన్షియల్‌ మెడిసిన్స్‌ (ఎన్‌ఎల్‌ఈఎం) క్రింద ఔషధాల ధరలలో రికార్డు స్థాయిలో 12 శాతం నుంచి 10 శాతం పెరిగాయి. ఆ తర్వాత ఫార్మా పరిశ్రమకు ఇది స్వల్ప పెరుగుదల. సవరించిన ధరలు జాతీయ అవసరమైన ఔషధాల జాబితాలో చేర్చబడిన 800 కంటె ఎక్కువ మందులను కవర్‌ చేస్తాయి. షెడ్యూల్‌ చేయబడిన ఔషధాల ధరలను సంవత్సరానికి ఒకసారి సవరించేందుకు అనుమతించబడుతుంది.

➡️