115 మందికి వైద్య పరీక్షలు

Mar 11,2024 00:05

ప్రజాశక్తి – ఇంకొల్లు రూరల్‌
మండలంలోని గంగవరం గ్రామంలో ఆరోగ్య వేదిక ఆధ్వర్యంలో బిపి, షుగర్‌ రెగ్యులర్‌ వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. బోడెంపూడి రాధాకృష్ణమూర్తి, జరుబుల వెంకట సుబ్బయ్య జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు మందులు పంపిణీ చేశారు. శిబిరంలో 115మందికి వైద్య పరీక్షలు నిర్వహించి రెండు నెలలకు సరిపడ మందులు అందజేశారు. డాక్టర్ ఎం రమేష్, బోడావుల శ్వేతాశ్రీ, టి దుర్గాప్రసాద్ రోగులను పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. తిరిగి మే నెల 12న వైద్య శిబిరం జరుగు తుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు వలేటి కృష్ణయ్య, సిఐటియు రాష్ట్ర నాయకులు వై సిద్దయ్య, కె రామకోటేశ్వరరావు, శ్రీనివాసరావు, ఆర్ వినోద్ బాబు, నాగండ్ల వెంకట్రావు, టి గోవిందరాజులు, వైద్య వేదిక కన్వీనర్ కర్రి బాలచందర్, కరి సృజన పాల్గొన్నారు.

➡️