ఆర్సీబీ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ఐపీఎల్ 2024 సీజన్ నుంచి విరామం తీసుకోకున్నట్లు వెల్లడించాడు. ఆర్సీబీ-సన్రైజర్స్ మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మ్యాక్స్వెల్ ఈ విషయాలను షేర్ చేసుకున్నాడు. శారీరక, మానసిక అలసట కారణంగా క్యాష్ రిచ్ లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు మ్యాక్సీ ప్రకటించాడు. విరామం ఎన్ని రోజుల అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మ్యాక్స్వెల్ ఈ సీజన్లో ఆడిన ఆరు మ్యాచ్ల్లో కేవలం 32 పరుగులు (0, 3, 28, 0, 1, 0) మాత్రమే చేశాడు. ఇందులో మూడు డకౌట్లు ఉన్నాయి. ఈ సీజన్లో ఆర్సీబీ 7 మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక మ్యాచ్లో గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.