జాతీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు తొలగించాలి

Mar 23,2024 12:02 #Konaseema

ప్రజాశక్తి-రామచంద్రపురం : జాతీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వెంటనే తొలగించాలని మైనార్టీ బీసీ సంఘం అధ్యక్షులు యాట్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ద్రాక్షారామ మసీద్ సెంటర్ లో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులు విగ్రహాలు కు ముసుగు వేయడం వారిని అవమానించడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధందనలు ప్రకారం కేవలం రాజకీయ నాయకులు విగ్రహాలుకు మాత్రమే ముసుగులు వేయడం అనేది ఎన్నికల నియమావళికి సంబంధించినది. కానీ జాతీయ నాయకులు విగ్రహాలకు ముసుగు వేయడం అనేది ఆ మహనీయులను అవమానించడమేనని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. జాతీయ ఉద్యమ నాయకులు ఏ పార్టీకి చెందినవారు కాదని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా ఎన్నికలు కమీషన్ సంబంధించిన జిల్లా కలెక్టర్, ఆర్డీఓ తదితర అధికారులు స్పందించి తక్షణం మహాత్మా జ్యోతిరావు దంపతులు విగ్రహాలకు వేసిన ముసుగులు తొలగించాలని డిమాండ్ చేశారు.

➡️