ఛత్తీస్గడ్ : ఛత్తీస్గడ్ బీజాపూర్ జిల్లాలోని చుట్వాహిలోని పోలీస్ క్యాంప్ పై మావోయిస్టులు దాడి చేశారు. పోలీస్ క్యాంప్ పై మావోయిస్టులు బాంబుల వర్షం కురిపించారు. తెలంగాణ ఛత్తీస్గడ్ లో జరిగిన ఎన్కౌంటర్లకు నిరసనగా మావోయిస్టలు బంద్ పాటిస్తున్న నేపథ్యంలో… పోలీస్ క్యాంపుపై దాడి చేశారని, దీనిలో మావోయిస్టు అగ్ర నాయకులు పాల్గోన్నట్లుగా సమాచారం. పోలీస్ క్యాంపు పై ఇంకా మావోయిస్టుల దాడి కొనసాగుతోంది.