ఉఖ్రుల్ : మణిపూర్లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్స్కేల్పై 3.9 తీవ్రతగా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సిఎస్) సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఉదయం 6.56 గంటల సమయంలో మణిపూర్లోని ఉఖ్రూల్ సమీపంలో 3.9తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఎన్సిఎస్ పేర్కొంది. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.