ప్రజాశక్తి-మండపేట : తమ డిమాండ్ల సాధన కోసం వివిధ రూపాల్లో అంగన్వాడీలు ఇప్పటికే 42 రోజులుగా సమ్మె చేపట్టగా దీనిలో భాగంగా కోటి సంతకాలతో రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు విజయవాడ వెళ్లేందుకు బయలుదేరిన అంగన్వాడీలను పోలీసులు ఎక్కడెక్కడ నిర్బంధించారు. కొంతమందిని బందర్ పోలీస్ స్టేషన్ కు తరలించగా మరి కొంతమందిని మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. తెల్లవారుజామున రెండు గంటల నుంచి అరెస్టులు కొనసాగాయని కనీసం టీ, కాఫీ కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా అవకాశం ఇవ్వట్లేదని బందర్ పోలీస్ స్టేషన్లో ఉన్న అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. బీపీ, షుగర్ తదితర సమస్యలున్న అంగన్వాడీల పరిస్థితి ఏమిటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.