ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరితో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్డిఎ అభ్యర్థుల గెలుపునకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కృషి చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సి వర్గీకరణకు బిజెపి కట్టుబడి ఉందని పురందేశ్వరి పేర్కొన్నారు.