వైసిపి పథకాలను చంద్రబాబు కాపీ : మల్లాది విష్ణుప్రజాశక్తి – తిరుపతి సిటి: రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం అధికంగా కనిపిస్తోందని, సిఎం జగన్పై విజయవాడ నడిబొడ్డున జరిగిన హత్యాయత్నంలో టిడిపివారు పాలుపంచుకున్నారని తెలుస్తోందని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మల్లాది విష్ణు తెలిపారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రజాభిమానాన్ని చూరగొన్నాడని, దాన్ని చూసి ఓర్వలేకనే దాడి చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో నేరచరిత్ర ఉన్న ఏకైక పార్టీ టిడిపి అని అన్నారు. రాష్ట్రంలో బ్రాహ్మణ సంక్షేమం కోసం జగన్ కృషి చేశారన్నారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటిని సమపాళ్లలో అందించాడన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి నుంచి కూటమిలోని టిడిపి, బిజెపి, జనసేన ప్రకటించి మరుగున పడేశారన్నారు. తిరుపతి వైసిపి అభ్యర్థి భూమన అభియన్రెడ్డిని ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో భీమాస్ అశోక్, వెంకట్ పెరుమాళ్, విజరుకుమార్, హరిప్రసాద్, సరళ పాల్గొన్నారు.