భారీ లక్ష్యాన్ని ఛేదించిన మహారాష్ట్ర

Dec 1,2023 22:11 #Sports

మూడు వికెట్ల తేడాతో హైదరాబాద్‌ ఓటమి

ఛండీగడ్‌: విజయ్ హజారే వన్డే టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ జట్టు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. గ్రూప్‌-బిలో భాగంగా శుక్రవారం తొలిగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 315పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్‌(103) సెంచరీకి తోడు రాహుల్‌ సింగ్‌(69), రాహుల్‌ బుద్ధి(58నాటౌట్‌) బ్యాటింగ్‌లో రాణించారు. కౌశల్‌ టాంబ్‌, కేదర్‌ జాదవ్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. ఆ లక్ష్యాన్ని మహారాష్ట్ర జట్టు 49.4ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంకిత్‌ బాప్సే(113), అజీమ్‌ ఖాజి(80) బ్యాటింగ్‌లో రాణించారు. కార్తికేయ కాక్‌ కు ఐదు, తనయ్ త్యాగరాజన్‌, రక్షణ్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. ఇక గ్రూప్‌ాడిలో ఆంధ్రాగుజరాత్‌ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. దీంతో ఇరుజట్లకు ఒక్కో పాయింట్‌ దక్కాయి.

➡️