తహశీల్దార్ గోపాలకృష్ణ.
ప్రజాశక్తి – ఆలమూరు : ఎన్నికల నియమావళికి సంబంధించి ప్రతి ఒక్కరు సమాయత్తం కావాలని తహశీల్దార్ ఏ.గోపాలకృష్ణ బిఎల్ఓలకు ఆదేశించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండల పరిధి గ్రామాల బిఎల్వోలు, సచివాలయ ఉద్యోగులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితా వెరిఫికేషన్ వాటిలో తప్పు, ఒప్పులపైన బిఎల్ఓ లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలు పునరావృతం కాకూడదని త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అన్నారు. ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చని అందరూ సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అధిక సమయం ఇచ్చిందని మనం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డీటీలు జానకి రామయ్య, జానకి రాఘవ, మండల సర్వేయర్ సందీప్ కుమార్, వీఆర్వోలు, బిఎల్వోలు, తదితరులు పాల్గొన్నారు.