మహబూబ్ నగర్ : మహబూబ్నగర్ ఎంఎల్సి ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా పడింది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో … వాయిదా వేయాలని ఈ మేరకు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రవినాయక్కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. జూన్ రెండో తేదీన ఎమ్మె ల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు చేపట్టి.. ఐదో తేదీలోగా ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. మరోవైపు ఇప్పటికే అధికారులు కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఫలితాలపై అధికార పార్టీ, ప్రతిపక్ష బిఆర్ఎస్ గెలుపు ధీమాతో ఉన్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆదివారం కలెక్టరేట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవినాయక్ కౌంటింగ్ సిబ్బందితో సమీక్షించారు. కౌంటింగ్ నిర్వహించే బాయ్స్ కాలేజ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫలితాల కోసం పార్టీలు ఆతృతగా ఎదురు చూస్తున్న క్రమంలో కౌంటింగ్ వాయిదా పడడంతో నాయకుల్లో నిరుత్సాహం నెలకొంది.