సీనియర్ సివిల్ జడ్జి షేక్ బాబా ఫక్రుద్దీన్
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ఈనెల 7వ తేదీన జరగబోయే లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కడప సీనియర్ సివిల్ జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ బాబా ఫకృద్దీన్ అన్నారు. రాజంపేట ఉపకారాగారాములోని ఖైదీలను సోమవారము ఆయన పరామర్శించారు. అనంతరము న్యాయస్థానములో న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో సమావేశమయ్యారు. లోక్ అదాలాత్ విజయవంతములో కక్షిదారులకు మేలు జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలన్నారు. లోక అదాలాత్ లో న్యాయవాదుల సమస్యలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లగలనన్నారు. ఈ కార్యక్రమములో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ డాక్టర్ పసుపులేటి శంకర్, ఏ పి పి రెహనా రసూల్, న్యాయవాదులు లక్ష్మీనారాయణ, కృష్ణకుమార్, సుదర్శన రెడ్డి, వెంకటసుబ్బయ్య, వెంకటస్వామి, కరుణాకరరాజు తదితరులు పాల్గొన్నారు.